
భర్త చిత్రపటాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చారు. తల్లిని ఓదార్చేందుకు నిషిక
నటుడు నందమూరి తారకరత్న చిన్నకర్మను బుధవారం ఆయన కుటుంబసభ్యులు నిర్వహించారు. ఫిబ్రవరి 18వ తేదీన తారకరత్న శివైక్యం చెందగా 20న అంత్యక్రియలు జరిపారు. ఆయన భౌతిక కాయాన్ని దహనం చేసిన రెండు రోజులకు చిన్న కర్మ చేశారు. ఈ కార్యక్రమంలో తారకరత్న తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, నందమూరి బాలకృష్ణ, కల్యాణ్ రామ్ సహా ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీప్రముఖులు పాల్గొని తారకరత్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
వెక్కివెక్కి ఏడ్చిన అలేఖ్యా రెడ్డి
తారకరత్న ఇక లేరనే విషయాన్ని ఆయన భార్య అలేఖ్యా రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. భర్త చిత్రపటాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చారు. తల్లిని ఓదార్చేందుకు నిషిక ప్రయత్నించినప్పటికీ ఆమె కన్నీళ్లు ఆగలేదు. భర్త లేకుండానే భవిష్యత్తు కొనసాగించాలన్న బాధ ఆమెను నిలువెల్లా దహిస్తుండటంతో కన్నీటిపర్యంతమయ్యారు. బరువెక్కిన గుండెతో, కన్నీళ్లతో చిత్రపటానికి పూలు వేసి నమస్కరించారు అలేఖ్య.