Rashi Khanna: శ్రీవారిని దర్శించుకున్న స్టార్‌ హీరోయిన్‌

Actress Raashi Khanna Visits Tirumala Tirupati Devasthanam - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ రాశీ ఖన్నా తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆమె వీఐపీ ద‌ర్శ‌న స‌మ‌యంలో స్వామి వారి సేవ‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆమెకు స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. ద‌ర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆమెను ఆశీర్వదించి ప్రసాదాలను అందజేశారు.

చదవండి: నాకు అలాంటి సీన్స్‌లో నటించడమే ఈజీ: రాశీ ఖన్నా

కాగా తాను తాజాగా నటించిన చిత్రం  ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా విజ‌య‌వంతం కావాల‌ని శ్రీవారిని ప్రార్థించిన‌ట్లు రాశీ ఖ‌న్నా పేర్కొన్నారు. మారుతి దర్శకత్వంలో గోపిచంద్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 1న విడుదల కాబోతుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top