Kamalinee Mukherjee : ఇండస్ట్రీని వదిలేసిన కమిలిని ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

Actress Kamalinee Mukherjee Recent Look Shocks Netizens Pics Go Viral - Sakshi

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తారలు సడెన్‌గా మాయమవుతుంటారు. కొన్నిసార్లు వాళ్లు ఎక్కడున్నారు? ఏం చేస్తుంటారు అన్నది కూడా తెలియదు. అలాంటి వాళ్లలో హీరోయిన్‌ కమలిని ముఖర్జీ కూడా ఒకరు. 2004లో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఆనంద్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ భామ.

మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కమిలిని ఆ తర్వాత ఆమె నటించిన గోదావరి, హ్యాపీడేస్‌, గమ్యం, జల్సా వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. చివరగా గోవిందుడు అందరివాడేలే చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఇంతవరకు ఆమె సినిమాల్లో నటించలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో కట్టిపడేసిన కమిలిని ఇప్పుడు అమెరికాలో సెటిల్‌ అయ్యింది.

సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో బాగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా డల్లాస్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో కనిపించి సందడి చేసింది. ఈ ఫోటోలు బయటకు రావడంతో కమిలిని ముఖర్జీ లుక్‌ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఏంటి ఇలా మారిపోయింది? అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top