Jamuna Last Rites:మహాప్రస్థానంలో ముగిసిన జమున అంత్యక్రియలు

Actress Jamuna Last Rites Will Be Conducted By Daughter Sravanthi - Sakshi

అలనాటి అందాల తార జమున అంత్యక్రియలు ముగిశాయి. అశ్రునయనాల మధ్య జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆమె కూతురు స్రవంతి జమునకు దహన సంస్కారాలు నిర్వహించింది. జమున మరణంతో ఇండస్ట్రీలో టాలీవుడ్‌ శోక సంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

ఆమెను కడసారి చూసేందుకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఫిల్మ్‌ఛాంబర్‌లోని ఆమె భౌతిక కాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.  లక్ష్మీ పార్వతి, తమ్మా రెడ్డి భరద్వాజ, మురళి మోహన్, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత రావు  తదితరులు నివాళులు అర్పించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top