ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా
పర్యావరణ పరిరక్షణకు చాలా మంది భక్తులు మట్టి వినాయక ప్రతిమలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మట్టి వినాయకులను ప్రతిష్ఠించి, పూజించే వారిని ‘సాక్షి’ ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా మట్టి వినాయకులను పూజించే భక్తులు సెల్ఫీ తీసుకుని ‘సాక్షి’కి పంపిస్తే, వారి ఫొటోలను ప్రచురించనున్నాం. వాట్సాప్ 9059775328కు పంపించండి మరి..
22(ఏ)లో కొండాపూర్లోని 500 ఎకరాలు ● 50 ఏళ్ల క్రితం పట్టాలిచ్చిన సర్కార్
యాభై ఏళ్ల క్రితం ఐదు వందల ఎకరాలకు ఆనాటి ప్రభుత్వం పట్టాలిస్తే గత 8 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ సర్కార్ ఆ భూములను పార్ట్(బీ)లో పెట్టింది. అయితే ఈ భూములను కాంగ్రెస్ సర్కార్ నిషేధిత జాబితాలోకి నెట్టింది. సమస్య పరిష్కరించి మళ్లీ పట్టాలివ్వాలంటూ ఆ గ్రామస్తులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్య ఊళ్లోని ఒకరిద్దరిది కాదు మూడు వేలకు పైగా ప్రజలది. పాలకుల పక్షపాతం, అధికారుల అలసత్వానికి ఇప్పటికీ పరిష్కృతం కాని ఈ గ్రామ సమస్య ఓ నిదర్శనం. – మెదక్జోన్


