
అర్హులకే డబుల్బెడ్రూం ఇవ్వాలి
మెదక్ కలెక్టరేట్: డబుల్బెడ్రూం ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం చేగుంట మండలానికి చెందిన ప్రజలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో పంపిణీకి సిద్ధంగా ఉన్న 108 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు కేటాయించినప్పటికీ రాజకీయ లబ్ధి కోసం పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు, పాలకుల స్వార్థ ప్రయోజనాలకు కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా పరిపాలన అధికారులు అర్హులను గుర్తించి పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేష్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మినరసయ్య, లక్ష్మి, నాగమణి, నర్సిహులు, శోభ, వినోద, రాజమణి, భాగ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట లబ్ధిదారుల ధర్నా