జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేసేందుకు పీసీపీఎన్డీటీ కమిటీతో ఐదు బృందాలను ఏర్పాటు చేశాం. స్కానింగ్ నిబంధనలు సక్రమంగా పాటిస్తున్నాయో లేదో పరిశీలించి, వెంటనే వాటిపై చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటాం. అన్ని స్కానింగ్ కేంద్రాల నిర్వహణ పరిశీలించడంతోపాటు లింగనిర్ధారణ చేసినట్లుగా ఏ స్కానింగ్ కేంద్రం వ్యవహరించినా చట్టం ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ నరేందర్రాథోడ్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, మంచిర్యాల


