శ్రీరాంపూర్: కంపెనీ ఆస్తుల పరిరక్షణకు ఎస్టేట్స్ విభాగం చేస్తోందని జీఎం, ఎస్టేట్స్(కార్పొరేట్) జీఎస్ గోపాలరాజు తెలిపారు. జీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆయన శ్రీరాంపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయంలో జీఎం ఎం.శ్రీనివాస్ ఆయన్ను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కంపెనీ భూములను పరిరక్షించడానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నారన్నారు. ఎస్టేట్ విభాగాన్ని మరింత పటిష్టం చేయడానికి గోపాలరాజు చేస్తున్న కృషి చేస్తున్నారని కొనియాడారు. ఏరియా ఎ్స్ఓటు జీఎం కృష్ణప్రసాద్, ఏజీఎం(ఫైనాన్స్) శ్రీధర్, డీజీఎంలు అనిల్కుమార్, రాజన్న, హరినారాయణ, ఎస్టేట్స్ మేనేజర్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


