ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించాలి

Aug 18 2026 12:15 AM | Updated on Aug 18 2026 12:15 AM

ఉట్నూర్‌రూరల్‌: ప్రజావాణి దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వాణిలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజ ల నుంచి వినతులు స్వీకరించారు. బోర్‌వెల్‌ మంజూరు చేయాలని గుడిహత్నూర్‌ మండలం తోయగూడకు చెందిన పెందోర్‌ వినాయక్‌, వాచ్‌మెన్‌ ఉద్యోగం ఇప్పించాలని మంచిర్యాల మండలం పెద్ద గోపాలపూర్‌కు చెందిన హన్మంతు, ఆర్థికసాయం అందించాలని కెరమెరికి చెందిన భూదేవి దరఖాస్తు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement