గమ్యం చేరని పయనం! | - | Sakshi
Sakshi News home page

గమ్యం చేరని పయనం!

Aug 8 2026 1:53 AM | Updated on Aug 8 2026 1:53 AM

● ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని డ్రైవర్లు ● జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు ● అవగాహన కల్పిస్తున్నా మారని తీరు ● నిర్లక్ష్యంతో పోతున్న నిండు ప్రాణాలు ● రహదారులపై మూలమలుపుల వద్ద, టీ జంక్షన్‌, యూటర్న్‌ తీసుకునే ముందు వేగాన్ని తగ్గించి ఎటు వైపు వెళ్లాలో అటు వైపు ఇండికేటర్‌ వేసుకుని వెళ్లాలి. ● రహదారికి అన్ని వైపులా గమనించాకే వాహనాన్ని మలుపు తిప్పాలి. ● రహదారులపై గల మూల మలుపుల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ ముందువెళ్తున్న వాహనాలను ఓవర్‌ టేక్‌ చేయొద్దు. ● త ్వరగా గమ్యస్థానం చేరుకోవాలనే తొందరలో రాంగ్‌ రూట్‌లో వెళ్లొద్దు. ● జనవరి 11న జాతీయ రహదారిపైన జిల్లా కేంద్రంలోన రాజీనగర్‌ ఫ్‌లైఓవర్‌ బ్రిడ్జి సమీపంలో వెనుక నుండి అతి వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి ముందుగా వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో బొడ్డు తిరుపతి (41) అక్కడికక్కడే మృతి చెందాడు. ● మార్చి 3న రాత్రి జైపూర్‌ మండలం ఇందారం చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న కమర్షియల్‌ ట్యాక్స్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ ఆలపూరి అనురాగ్‌ (35)ను ఓ కారు అతివేగంగా దూసుకువచ్చి ఢీకొట్టడంతో అతడు చెట్ల పొదల్లోకి ఎగిరిపడి తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ● మే 28న లక్సెట్టిపేటకు చెందిన పద్మ–కృష్ణమోహన్‌ దంపతులు, వారి ఏకై క కుమారుడు వెంకటసాయి సుశీల్‌ (18) కారులో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా జైపూర్‌ మండలం ఇందారం చౌరస్తా వద్ద ఆగి ఉన్న లారీకి కారు అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటసాయి సుశీల్‌ అక్కడికక్కడే మృతి చెందగా పద్మ, కృష్ణమోహన్‌కు తీవ్రగాయాలయ్యయి.

వాహనదారులకు జాగ్రత్తలు

మంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు పో లీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పెద్దగా ఫలి తం ఉండడం లేదు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ ప్రాణాల మీ దకు తెస్తోంది. రాంగ్‌ రూట్లలో వెళ్లడం, అతివేగం, రోడ్డు క్రాస్‌ చేయడంలో చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగానే చాలా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరగా చేరుకోవాలని అతివేగంగా వెళ్తు న్న పలువురు వాహనచోదకులు గమ్యం చేరకుండానే ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో నాలుగేళ్లలో 1,554 ప్రమాదాలు చోటు చేసుకోగా, 467 మంది మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది.

ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకనే..

రహదారి భద్రత విషయంలో రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఎప్పటికప్పుడు ఆయా శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రమాదాలు జరిగే బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి వాటిని సరి చేస్తున్నారు. మద్యం మత్తు, అతి వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ట్రాఫిక్‌ నియమాలు పాటించని కారణంగా కొందరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.

తప్పించుకు తిరుగుతూ..

రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడానికి, ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్‌ యంత్రాంగం అనేక చర్యలు తీసుకుంటోంది. డ్రంకెన్‌ డ్రైవ్‌, హెల్మెట్‌ ధరించక పోవడం, రాంగ్‌ రూట్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, అతివేగం తదితర ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినవారికి జరిమానా విధిస్తోంది. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుపడుతున్నవారికి జైలు శిక్షలూ పడుతున్నాయి. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే వేరే రూట్‌లో వెళ్లిపోతున్నా రు. కొన్ని సందర్భాల్లో పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అయినప్పటికీ వారు పద్ధతి మార్చుకోవడం లేదు.

జిల్లాలో ఇటీవలి మేజర్‌ ప్రమాదాలు

2023 నుంచి 2026 జూలై

వరకు రోడ్డు ప్రమాదాల వివరాలు

సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు

2023 326 111 320

2024 412 132 434

2025 429 136 435

2026 387 88 299

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement