శ్రామిక్‌ పోస్టుల భర్తీలో అన్యాయం | - | Sakshi
Sakshi News home page

శ్రామిక్‌ పోస్టుల భర్తీలో అన్యాయం

Aug 18 2026 7:40 AM | Updated on Aug 18 2026 7:40 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఏడాది క్రితం ఆర్టీసీ శ్రామిక్‌ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ సోమవారం ఆర్‌ఎం కార్యాలయం ఎదుట కొద్దిసేపు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన అప్రెంటిస్‌ చేసిన అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్‌ 17న ప్రకటించిన నోటిఫికేషన్‌ మేరకు తాము దరఖాస్తు చేసుకున్నామన్నారు. అయితే ఈ రిక్రూట్‌మెంట్‌లో తమకు వెయిటేజీ ఇవ్వకుండా ఆర్టీసీలో అప్రెంటిస్‌ చేయని వారితోపాటు ప్రైవేట్‌ సంస్థలకు చెందిన అభ్యర్థులతో భర్తీ చేయడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. తాము రెండేళ్ల పాటు సంస్థలో అప్రెంటిస్‌ చేసినా ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement