మదనాపురం: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కురుమూర్తిరాయ ఎత్తిపోతల పథకం మో టార్లను ఆన్ చేసి కాల్వలకు ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి ఆదివారం నీటిని విడుదల చేశారు. అనంతరం గ్రామంలో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద నీటి లభ్యతను బట్టి ఇప్పటికే కోయిల్సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ఫేజ్–1, 2 ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేశామన్నారు. సాంకేతిక అధికారుల సూచనలు, రైతుల అవసరాల ఆధారంగా నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో లిఫ్టు చైర్మన్ రాజవర్ధన్రెడ్డి, సర్పంచు రాజేష్యాదవ్, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
72.013 మి.యూ
విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు కలిపి 72.013 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు. దిగువ జూరాలలోని ఒక యూనిట్లో సాంకేతిక సమస్య తలెత్తిందని త్వరలోనే సమస్యను పరిష్కరించి పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేపడుతామని వెల్లడించారు.
.............
09కేకేటీ101


