లక్ష్మీచెన్నకేశవుడికి.. | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీచెన్నకేశవుడికి..

Jul 26 2026 3:02 AM | Updated on Jul 26 2026 3:02 AM

జడ్చర్ల టౌన్‌: ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్శామికి ఆషాడ శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని వైభవంగా లక్ష పుష్పార్చన జరిపించారు. కాళ్ల మంటపం వద్ద స్వామివారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి ఆలయ కార్యనిర్వహణాధికారి దీప్తిరెడ్డి పుష్పార్చన ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు సామూహిక కుంకుమార్చనలు చేశారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభమైన వేడుకలు పంచామృతాభిషేకం, పుణ్యాహవచనము, రుత్విక్వరణం, ప్రదోష పూజ, శయనోత్సవం నిర్వహించారు. ఆదివారం సహాస్రనామార్చన, మహానివేదనతో వేడుకలు ముగుస్తాయి. ఏకాదశి పురస్కరించుకుని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement