సీబీఎస్సీ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు
మహబూబ్నగర్ ఎడ్యుకేసన్: సీబీఎస్సీ ఎస్సెస్సీ ఇంప్రూమెంట్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని మౌంట్బాసిల్ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థులు సాత్విక (498) ఆల్ ఇండియా 3వ ర్యాంక్, తెలంగాణలో 2వ ర్యాంక్ సాధించింది. హేమవర్దన్ (495) మౌలిక (489) వెన్నెల (488) మార్కులు సాధించారు. 480 మార్కుల కంటే ఎక్కువ 17 మంది సాధించారని ప్రిన్సిపాల్ సోమశేఖర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను చైర్పర్సన్ చంద్రకళ వెంకటయ్య, డైరెక్టర్ శిరీష ప్రవీణ్, పూజితా మోహన్రెడ్డి, సుశాంత్కృష్ణ తదితరులు అభినందించారు.


