టీ–20 లీగ్‌లో మహబూబ్‌నగర్‌ విజయం | - | Sakshi
Sakshi News home page

టీ–20 లీగ్‌లో మహబూబ్‌నగర్‌ విజయం

Dec 28 2025 8:42 AM | Updated on Dec 28 2025 8:42 AM

టీ–20 లీగ్‌లో మహబూబ్‌నగర్‌ విజయం

టీ–20 లీగ్‌లో మహబూబ్‌నగర్‌ విజయం

క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన జిల్లా జట్టు

ఆల్‌రౌండ్‌ ప్రతిభ కనబరిచిన

క్రీడాకారులు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: హైదరాబాద్‌లోని గ్రీన్‌వ్యూ క్రికెట్‌ గ్రౌండ్‌–3లో శనివారం జరిగిన హెచ్‌సీఏ బి–డివిజన్‌ టీ–20 లీగ్‌ కం నాకౌట్‌ టోర్నమెంట్‌లో మహబూబ్‌నగర్‌ జిల్లా జట్టు విజయం సాధించింది. ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మహబూబ్‌నగర్‌ జిల్లా జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన మహబూబ్‌నగర్‌ జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. జట్టులో ఎ.శ్రీకాంత్‌ 22 బంతుల్లో 3 ఫోర్లతో 30, అబ్దుల్‌ రాఫే 20 పరుగులు చేశారు. ఖల్సా బౌలర్లు కరణ్‌ యాదవ్‌ 2, సన్నపవార్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఖల్సా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. కరణ్‌పట్నాయక్‌ 36, దీపాంషు 30 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్‌ బౌలర్లు మహ్మద్‌ షాదాబ్‌ 3 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 2, మహ్మద్‌ ముఖితుద్దీన్‌ 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, కొండ శ్రీకాంత్‌, గగన్‌ చెరో వికెట్‌ తీశారు. టీ–20 లీగ్‌లో జిల్లా జట్టు మ్యాచ్‌ గెలుపొందడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ అభినందించారు. ఇదే స్ఫూర్తితో రానున్న మ్యాచుల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement