
రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలి
మహబూబ్నగర్ రూరల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఓపీఎంఎస్లో రైతుల వివరాలు వెంటనే నమోదు చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. గురువారం కోటకదిర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా అప్పాయిపల్లి వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, కొనుగోళ్ల వివరాలు తెలుసుకున్నారు. సరైన తేమ శాతం, నాణ్యత ప్రమాణాలతో తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ట్యాగ్ చేసిన మిల్లుకు పంపించాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. కొనుగోలు చేసిన వెంటనే రైతుకు కొనుగోలు చేసిన వివరాలతో కూడిన పత్రం అందజేయాలన్నారు. కొనుగోలు తర్వాత ధాన్యం మిల్లుకు పంపే వరకు కేంద్రాల నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాలన్నారు. ధాన్యం మిల్లుకు రవాణా చేసేందుకు అవసరమైన లారీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతుల వివరాలు వెనువెంటనే ఓపీఎంఎస్లో నమోదు చేసి రైతులకు చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాసహకార అధికారి శంకరాచారి, సహకార ఆడిట్ అధికారి టైటస్ పాల్, తహసీల్దార్ సుందర్రాజ్ తదితరులు ఉన్నారు.