అమ్మవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

అమ్మవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

Mar 5 2026 8:25 AM | Updated on Mar 5 2026 8:25 AM

హన్మకొండ కల్చరల్‌: నగరంలోని భద్రకాళి దేవాలయాన్ని బుధవారం ఆంధ్రపదేశ్‌ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.హెచ్‌ మానవేంద్రనాఽథ్‌ సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తిని ఆలయ పరిశీలకుడు క్రాంతికుమార్‌, ధర్మకర్త తొనుపునూరి వీరన్న ఘనంగా స్వాగతించారు. న్యాయమూర్తి ముందుగా ఆదిశంకరులు, వల్లభగణపతిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించి ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వెంట వరంగల్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తులు ఉన్నారు. అలాగే, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు తన జన్మదినం సందర్భంగా అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజుకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. టీఎన్‌జీఓ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్‌, యూనియన్‌ నాయకులు, కార్పొరేటర్‌ జన్ను షీబారాణి, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement