వైద్యశిబిరాలు ఏర్పాటు చేయండి
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్
కురవి: గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆస్పత్రిలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడారు. జాతీయ కార్యక్రమాలను నిర్వహించాలని, ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. సిబ్బంది గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విరాజిత, సంధ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


