అవినీతి రహిత సమాజమే లక్ష్యం
వరంగల్ క్రైం/విద్యారణ్యపురి: అవినీతి రహిత సమాజ నిర్మాణమే మన అందరి లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకుని.. అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని సీపీ జెండా ఊపి ప్రారంభించారు. హనుమకొండ జూనియర్ కళాశాల నుంచి అశోకా సెంటర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీ లో విద్యార్థులతో పాటు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఏసీబీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అవినీతిని నిర్మూలించడం ద్వారా దేశాభివృద్ధి జరుగుతుందని, భవి ష్యత్లో అవినీతి నిర్మూలనలో విద్యార్థి, యువత పాత్ర చాలా కీలకమన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు. కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, ఇన్స్పెక్టర్ రాజు, ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.శ్రీనివాస్రావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్.రాజ్కుమార్, అధ్యాపకులు శ్రీదేవి, జ్యోతిర్మయి, సంధ్యారాణి, రేవతి, సరిత, సువర్ణ, జ్యోతి, సురేశ్బాబు, చిరంజీవి, రఘునందన్, వివేక్, భవాని, సాగర్, వేణు, రాజేశ్, దయాకర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్
సన్ ప్రీత్ సింగ్
అవగాహన ర్యాలీ ప్రారంభం


