శుభముహూర్తం ఎప్పుడు?
● నామినేషన్ దాఖలుకు పురోహితుల వద్దకు వెళ్తున్న అభ్యర్థులు..
పాలకుర్తి టౌన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామంలో ఈ నెల 3వ తేదీన మూడో విడత నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు శుభముహూర్తం చూసుకుంటున్నారు. పురోహితులను కలిసి పేరు బలం తెలుసుకుంటున్నారు. నామినేషన్ దాఖలు చివరి రోజైన 5వ తేదీ శుక్రవారం కావడంతో తిథి పాడ్యమి ఉండడంతో ఆ రోజు ఎక్కువ మంది మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 గంటల విజయ ముహూర్తం ఉందని పురోహితుడు దేవగిరి సంతోష్శర్మ తెలిపారు.


