డిగ్రీ ఇయర్‌వైజ్‌ పరీక్షల ఫలితాల వెల్లడి | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ ఇయర్‌వైజ్‌ పరీక్షల ఫలితాల వెల్లడి

May 25 2025 10:48 AM | Updated on May 25 2025 10:48 AM

డిగ్రీ ఇయర్‌వైజ్‌ పరీక్షల ఫలితాల వెల్లడి

డిగ్రీ ఇయర్‌వైజ్‌ పరీక్షల ఫలితాల వెల్లడి

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిఽధి లో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన డిగ్రీ కోర్సు ల బీఏ, బీకాం, బీబీఏ, బీఎసీ కోర్సుల (ఇయర్‌వైజ్‌ బ్యాక్‌లాగ్స్‌) మొదటి, ద్వితీయ, ఫైనలియర్‌ పరీక్ష ల ఫలితాలను శనివారం వీసీ కె.ప్రతాప్‌రెడ్డి.. రిజి స్ట్రార్‌ వి.రామచద్రంతో కలిసి విడుదల చేశారు. మొత్తం 1,832మంది విద్యార్థులు పరీక్షలకు హా జరుకాగా అందులో1,370మంది (74.38శాతం)ఉత్తీర్ణత సాధించినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్‌ తెలిపారు. ఈ ఫలితాలను కేయూ వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసి.ఇన్‌లో చూడొచ్చని తెలిపారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారులు ఎం. తిరుమలాదేవి, పి. వెంకటయ్య, క్యాంప్‌ ఆఫీసర్‌ ఎన్‌. సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

పీహెచ్‌డీ పట్టాలకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

కేయూ క్యాంపస్‌: కేయూ 23వ స్నాతకోత్సవం జూలై 7వ తేదీన నిర్వహించనున్నారు. పీహెచ్‌డీ పొందిన అభ్యర్థులు స్నాతకోత్సవంలో డాక్టరేట్‌ పట్టాలు పొందాలనుకునే వారు రూ. వెయ్యి చొప్పు న యూనివర్సిటీకి ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ.కేయూఆన్‌లైన్‌.కో.ఇన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని పరీక్షల నియంత్రణాధికారి రాజేంద ర్‌ శనివారం తెలిపారు. కేయూలో 2020 జనవరి 1 నుంచి 2025 మే 31వరకు పీహెచ్‌డీ పొందిన అ భ్యర్థులు 573 మంది ఉన్నారు. ఆర్ట్స్‌, సోషల్‌ సైన్స్‌, సైన్స్‌, కామర్స్‌అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, ‘లా’, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో పీహెచ్‌డీ పూర్తిచేసి న అభ్యర్థులు పట్టాలు పొందేందుకు రిజిస్ట్రేషన్‌ చే సుకోవాలన్నారు. కాగా,2016, 2017, 2018, 201 9, 2020, 2021 సంవత్సరాల్లో వివిధ కోర్సుల్లో గోల్డ్‌మెడల్స్‌ సాధించిన 564 మందికి కూడా స్నాతకో త్సవంలో గోల్డ్‌మెడల్స్‌ ప్రదానం చేస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement