కొత్తపల్లి: శ్రీశైలం జలాశయంలో రోజురోజుకు నీటీ నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో శుక్రవారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగుల నుంచి 861 అడుగులకు చేరుకుంది. దీంతో జాలాధివాసంలో ఉన్న ప్రాచీన సంగమేశ్వరాలయం కృష్ణా జలాల నుంచి బయల్పడుతుంది. ఆలయ గోపుర భాగం 5 అడుగుల మేర బయటపడింది. దీంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ఎగువ పుష్కర ఘాట్ వద్ద ఉన్న ఉమామహేశ్వరాలయంలో 5వ రోజు గాయత్రీ దేవి వరుణ జపములు వంటి ప్రత్యేక పూజలు ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ నిర్వహించారు.


