వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ.. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా’.. అంటూ విఘ్న నాయకుడిని జిల్లా ప్రజలు పూజించారు. వినాయక చవితి సదర్భంగా సోమవారం వాడవాడలా ఏకదంతుడి విగ్రహాలను ప్రతిష్టించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆకట్టుకునే బొజ్జ గణపయ్య విగ్రహాలు, విద్యుత్ దీప కాంతుల మండపాలు.. హోరెత్తిన భక్తిగీతాలు.. భక్తుల భజనలతో ఊరూరా సందడి నెలకొంది. ఎమ్మిగనూరు కోర్టు రోడ్డులో శక్తి వినాయక మండలి వారు ఈ ఏడాది దాదాపు 90 తులాల బంగా రు ఆభరణాలు వేసి పంచలోహ నాణెలతో తయారు చేసిన విగ్రహన్ని ప్రతిష్టింపజేసి పూజలు చేశారు. ఈ విగ్రహనికి సీసీ కెమెరాల నిఘాతో పాటు 15 మందికి పైగా కాపలా వుండటం విశేషం. – ఎమ్మిగనూరు టౌన్


