ప్రజలకు ఇంటి వద్దనే ప్రభుత్వ సేవలందించాల్సిన గ్రామ సచివాలయం దుండగుల చేతిలో ధ్వంసమైంది. సి.బెళగల్ మండలం కొండాపురం గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రజల కోసం ఈ భవనాన్ని నిర్మించింది. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా పట్టించుకోలేదు. నిరుపయోగంగా ఉన్న ఈ భవన తలుపులను, అద్దాలను ఇష్టానుసారంగా ధ్వంసం చేశారు. అదేవిధంగా కిటికీలను పెకళించి తీసుకెళ్లారు. ర్యాంప్ రోలింగ్ పైపును సైతం కొంతమేర అపహరించారు. ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. – సి.బెళగల్


