
తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీని విజయవంతం చేయాలి
రెబ్బెన: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆ ధ్వర్యంలో ఈనెల 21న సికింద్రాబాద్లో ని ర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల ఫ్లీ నరీని విజయవంతం చేయాలని ఫోరం రాష్ట్ర కోకన్వీనర్ దుర్గం రవీందర్, నియోజకవర్గ క న్వీనర్ ఆజ్మీర బాబురావు కోరారు. శనివా రం గోలేటి టౌన్షిప్లో వారు విలేకరులతో మాట్లాడారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు లక్ష్యంగా ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్లీనరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫ్లీనరీకి జిల్లా నుంచి ఉద్యమకారులు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఉద్యమకారుల ఫోరం నాయకులు తోట లక్ష్మణ్, బోగే ఉపేందర్ పాల్గొన్నారు.