నిలిచిన ‘ఉపాధి’ వేతనాలు | - | Sakshi
Sakshi News home page

నిలిచిన ‘ఉపాధి’ వేతనాలు

Apr 19 2025 9:30 AM | Updated on Apr 19 2025 9:30 AM

నిలిచ

నిలిచిన ‘ఉపాధి’ వేతనాలు

● రెండున్నర నెలలుగా పెండింగ్‌ ● ఇబ్బందులు పడుతున్న కూలీలు ● జిల్లాలో రూ.14.27కోట్ల బకాయిలు

తిర్యాణి: ఉపాధిహామీ కూలీల వేతనాలు నిలిచా యి. రెండు నెలలుగా వేతనాలు చెల్లింపులు నిలి చి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దారి ద్య్ర రేఖకు దిగువనున్న వారికి ఉపాధి కల్పించా లని 2005లో కేంద్రం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహమీ పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో కూలీకి వందరోజుల పని కల్పిస్తోంది. ప్రారంభంలో కూలీలకు ఎంతగానో ఉపయోగపడింది. క్రమక్రమంగా పథకంలో మార్పులు చేయడం.. నిబంధనలకు లోబడి వేతనాలు సరైన సమయంలో విడుదల చేయకపోవడంతో కూలీలు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఉపాధిహామీ కింద 1.23 లక్షల జాబ్‌కార్డులుండగా, 2.43 లక్షల మంది కూలీలున్నారు. ఇందులో 91వేల జాబ్‌ కార్డులు యాక్టివ్‌లో ఉండగా 1.70 మంది కూలీలు నిత్యం పనులకు వెళ్తున్నారు.

పోస్టాఫీస్‌ చుట్టూ ప్రదక్షిణలు

ఉపాధిహామీ పథకంలోని చట్టం ప్రకారం కూలీ లు పని చేసిన 21 రోజుల్లోనే వేతనాలు అందించాలి. కానీ.. ఫిబ్రవరి రెండవ వారం నుంచి ఇప్పటివరకు కూలీలకు వేతనాలు అందలేదు. జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి రెండో వారం నుంచి మార్చి 31 వరకు ఉపాధి పనులు చేపట్టిన 70,614 మంది కూలీలకు సంబంధించి రూ.6.65 కోట్ల వేతనాలు పెండింగ్‌లో ఉ న్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్‌ 1నుంచి ఇప్పటివరకు వరకు 74,862 మంది కూలీలు పనులకు వెళ్లగా వీరికి అందాల్సిన రూ.7.61 కోట్లు రాలేదు. మొత్తంగా దాదాపు రెండున్నర నెలలకు సంబంధించి రూ.14.27 కోట్లు ఉపాధి కూలీల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. అయితే వానాకాలం పంటల సాగు ముగిసాక రైతు కూలీలకు పని దొరకకపోవడంతో ఉపాధి పనులకు వెళ్లేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే గత 10 వారాలకు సంబంధించిన వేతనాల చెల్లింపులు పూర్తిగా ఆగిపోవడంతో కూలీలకు కుటుంబ పోషణ భారంగా మారింది. జిల్లాలో ఎక్కువగా కూలీలకు సంబంధించి పోస్టాఫీస్‌ ఖాతాలోనే వేతనాలు జమ అవుతుంటాయి. వేతనాలు వచ్చాయో.. లేదో.. తెలియక కూలీలు నిత్యం పోస్టాఫీస్‌ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.

ఆరువారాల పైసలు రావాలె

వానాకాలం పంటల సీజన్‌ ముగిసాక వ్యవసాయ పనులేవీ లేక ఉపాధిహామీ పనులకు వెళ్లినం. ఆరు వారాలకు సంబంధించిన పైసలు ఇంకా అకౌంట్‌లో పడలేదు. వారానికి రెండుసార్లు పైసలు పడ్డయో.. లేదోనని పోస్టాఫీస్‌కు వెళ్లి తెలుసుకుంటున్నం.

– శంకరమ్మ, గోలేటి, రెబ్బెన

వేతనాలు వెంటనే చెల్లించాలె

ఉపాధిహామీ పనులకు సంబంధించిన రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నయ్‌. పనులకు వెళ్లినా డబ్బులు రాకపోవడంతో చాలా కష్టమవుతోంది. వేతనాలు ఎప్పు డు వస్తయోనని ఉపాధిహమీ సిబ్బందిని అడిగితే ఎవరూ సరైనా సమాధానం ఇవ్వడం లేదు.

– దుర్శెట్టి సతీశ్‌, తిర్యాణి

నిలిచిన ‘ఉపాధి’ వేతనాలు1
1/2

నిలిచిన ‘ఉపాధి’ వేతనాలు

నిలిచిన ‘ఉపాధి’ వేతనాలు2
2/2

నిలిచిన ‘ఉపాధి’ వేతనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement