
ఆలయ భూముల్లో ‘ఇందిరమ్మ’ నిర్మాణాలు
ఆలయ భూముల్లో ‘ఇందిరమ్మ’ నిర్మాణాలు
ఆసిఫాబాద్ మండలంలోని కేశవనాథ ఆలయ భూముల్లో పలువురు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మండలంలోని గోవింద్పూర్ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయగా గ్రామానికి ప్రభుత్వం సుమారు 106 ఇళ్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలు పిల్లర్ల దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ ప్రతినిధులు, దేవాదాయశాఖ అధికారులు బుధవారం ఆక్రమణకు గురై న ఆలయ భూముల వద్దకు వెళ్లి నిర్మాణ పనులు అడ్డుకున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు స దరు స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు లేనప్పటికీ ఇంటి నిర్మాణానికి అధికారులు అనుమతులివ్వడం గమనార్హం. కేశవనాథ ఆలయ భూముల్లో ఇళ్ల నిర్మాణాల వెనుక ఎవరి హస్తముందన్న విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కాగా, ఆలయ భూములను సంరక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.