
ఆదివాసీలు హక్కులు సాధించుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: ఆదివాసీలు ఏకతాటిపైకి వచ్చి హక్కులు సాధించుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, ఆ పార్టీ సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వర్రావు అన్నారు. కెరమెరి మండలం జోడేఘాట్లో నిర్వహించిన సమావేశాల్లో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న కోట్నాక విజయ్, వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్స పోచయ్యను గురువారం జిల్లా కేంద్రంలో సన్మానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెంటయ్య, నాయకులు ప్రసాద్గౌడ్, దీపక్, మాటూరి జయరాజ్, మురళీగౌడ్, శ్రీకాంత్, శంకర్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.