
గ్రామగ్రామాన బీజేపీని బలోపేతం చేయాలి
రెబ్బెన: గ్రామగ్రామాన పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం కోరారు. ‘గావ్ చలో–బస్తీ చలో’ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలకేంద్రంలోని సీతారామాంజనేయస్వామి ఆలయ ప రిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగా లని సూచించారు. ఈ సందర్భంగా శ్రీశైలంను శాలువాతో సత్కరించారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు రాజేందర్ అగర్వాల్ను శ్రీశైలం శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మల్రాజు రాంబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కృష్ణకుమారి, జిల్లా కన్వీనర్ కొలిపాక కిరణ్కుమార్, నాయకులు మల్లిక్, గోలేం తిరుపతి, సంజీవ్, మల్లేశ్, సతీశ్, మధూకర్ తదితరులున్నారు.