యువ వికాసం సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

యువ వికాసం సద్వినియోగం చేసుకోవాలి

Apr 12 2025 2:58 AM | Updated on Apr 12 2025 2:58 AM

యువ వికాసం సద్వినియోగం చేసుకోవాలి

యువ వికాసం సద్వినియోగం చేసుకోవాలి

వాంకిడి: నిరుద్యోగులు రాజీవ్‌ యువ వికా సం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఆయన మాట్లాడు తూ పథకంలో అందుబాటులో ఉన్న యూని ట్లపై అవగాహన పెంచుకుని దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో వివరాలు సక్రమంగా చూసుకోవాలన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌ వద్ద సమర్పించాలని సూచించారు. సంబంధిత సిబ్బంది దరఖాస్తుల వివరాలను కులాల వారీగా రిజిస్ట్రార్‌లో నమోదు చేయాలన్నారు. కుల, ఆదాయ ధ్రువపత్రాలు త్వరగా మంజూరు చేయాలని తహసీల్దార్‌ రియా జ్‌ అలీని ఆదేశించారు. అనంతరం మండలంలో ఇప్పటివరకు అందిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖా స్తుల వివరాలను పంచాయతీ కార్యదర్శి శివకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని డీఆర్‌ డిపోను తనిఖీ చేశారు. ఎలాంటి అవకతవకలు లేకుండా సన్నబియ్యం పంపిణీ చేయాలన్నారు. ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఏపీవో శ్రావణ్‌కుమార్‌, ఆర్‌ఐ మాజిత్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement