బియ్యం బాగున్నయ్‌..! | - | Sakshi
Sakshi News home page

బియ్యం బాగున్నయ్‌..!

Apr 11 2025 1:05 AM | Updated on Apr 11 2025 1:05 AM

బియ్య

బియ్యం బాగున్నయ్‌..!

● సన్నబియ్యంపై మెజార్టీ ప్రజల అభిప్రాయం ఇదే.. ● అన్నం ముద్దవుతుండటంపై కొందరి అసంతృప్తి ● నూకల శాతం తగ్గించాలని సూచన ● జిల్లాలో ఇప్పటికే 70శాతం పంపిణీ పూర్తి

సంతోషకరం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయడం సంతోషకరం. ప్రస్తుతం సన్నబియ్యం నాణ్యతపై అనుమానాలు ఉన్నాయి.

– కమల, ఆసిఫాబాద్‌

ఆసిఫాబాద్‌అర్బన్‌/ఆసిఫాబాద్‌రూరల్‌/కెరమెరి/దహెగాం/రెబ్బెన/కౌటాల: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా ఏప్రిల్‌ నుంచి పంపిణీ చేస్తున్న సన్నబియ్యంపై జిల్లా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు ప్రభుత్వం దొడ్డు బియ్యం అందించగా.. అనేక మంది డీలర్‌కు విక్రయించడమో, లేక ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్మి డబ్బులు తీసుకునేవారు. ప్రస్తుతం చాలామంది సన్నబియ్యం ఇంట్లోనే వినియోగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 70శాతం పంపిణీ పూర్తయిందని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో సన్నబియ్యం పంపిణీపై లబ్ధిదారుల అభిప్రాయం తెలుసుకునేందుకు గురువారం ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. మొదటి నెల కావడంతో చాలామంది స్వయంగా షాపులకు వచ్చి బియ్యం తీసుకుంటున్నారు. బీపీటీ నాణ్యతతో ఉన్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు. బియ్యం సన్నగా ఉన్నా వండితే మాత్రం అన్నం దొడ్డుగా మారుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

జిల్లాలో ఇలా..

జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 317 రేషన్‌ దుకాణాలు, 1,39,795 కార్డులు ఉన్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు 1,26,584, అంత్యోదయ కార్డులు 13,191, అన్నపూర్ణ కార్డులు 20 వరకు ఉన్నాయి. జిల్లాలోని లబ్ధిదారులకు ప్రతినెలా 30,08,813 కిలోల బియ్యం సరఫరా చేస్తున్నారు. ఆహార భద్రత కార్డుదారులకు 25,46,928 కిలోలు, అంత్యోదయ 4,61,685 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 200 కిలోల బియ్యం అందిస్తున్నారు. సన్నబియ్యం తీసుకునేందుకు ప్రజలు మొగ్గు చూపుతుండటంతో ఇప్పటికే 70 శాతం పంపిణీ పూర్తయింది. జిల్లా సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని, అర్హులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. లబ్ధిదారుల ఇంట్లో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్వయంగా భోజనం చేస్తుండటంతో ప్రజల్లోనూ నమ్మకం పెరిగింది.

● దహెగాం మండల కేంద్రంలోని రేషన్‌ దుకాణం– 2 వద్ద సన్నబియ్యంపై లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకోగా.. చాలా మంది సన్నబియ్యం వండుకుని తింటున్నామని చెప్పారు. దహెగాం మండలంలో 9,195 కార్డులకు ప్రతినెలా 1,758 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే 95 శాతం పంపిణీ పూర్తయింది. మరో ఐదు శాతం మంది తీసుకోవాల్సి ఉంది. సన్నబియ్యం బీపీటీ రకానికి చెందినవని, 25 శాతం నూకలు కలిసి ఉన్నాయని చెబుతున్నారు. కొందరు మాత్రం మండల కేంద్రంలో కిలోకు రూ.23 చొప్పున అమ్ముకుంటున్నారు.

● రెబ్బెన మండలంలో 22 రేషన్‌షాపుల పరిధి లోని 9,746 రేషన్‌కార్డులకు 191 మెట్రిక్‌ ట న్నుల బియ్యాన్ని ప్రభుత్వం సరాఫరా చేసింది. కేవలం పది రోజుల్లోనే మండలంలో దాదా పు 80 శాతం పంపిణీ పూర్తయింది. మరో 28 టన్నుల బియ్యం మాత్రమే లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. లబ్ధిదారులు బియ్యం నాణ్య త తెలుసుకునేందుకు రేషన్‌షాపుల వద్ద క్యూ కడుతున్నారు. అన్నం ముద్దగా మారుతుండటంతో రానున్న నెలల్లో బియ్యం తీసుకునేందు కు ఆసక్తి చూపుతారా.. లేదా అనేది సందేహంగా మారింది.

● కెరమెరి మండలంలో 18 ఉండగా రేషన్‌ షాపులు ఉండగా, లబ్ధిదారులకు ప్రతినెలా 189 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేస్తున్నారు. సన్నబియ్యం వండితే అన్నం ముద్దగా మారుతుందని చాలామంది చెబుతున్నారు. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినగలమని, చల్లారిన తర్వాత తినలేమని మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బియ్యంలో 25శాతం నూకలు ఉన్నాయంటున్నారు.

● కౌటాల మండలంలోని మొత్తం 21 రేషన్‌ షాపులుండగా 9,410 కార్డులున్నాయి. మొద టి వారంలో ప్రతీ షాపునకు 50 క్వింటాళ్ల వర కు సన్నబియ్యం పంపిణీ చేయగా, ప్రస్తుతం అన్ని షాపులకు సరిపడా సరఫరా చేశారు.

నూకలు తగ్గించాలి

బియ్యం చూసేందుకు సన్నమే కని పిస్తున్నా వండితే మాత్రం అన్నం దొడ్డుగా తయారవుతుంది. అలాగే బియ్యంలో ఎక్కువగా నూకలు వస్తున్నాయి. నూకలు తగ్గించి నాణ్యమైన బియ్యం అందిస్తే మేలు.

– కోలే రవీందర్‌, గుండి, మం.ఆసిఫాబాద్‌

అన్నం ముద్దవుతుంది

సన్న బియ్యం కొత్తవి కావొచ్చు.. అన్నం కొంచెం ముద్దగా అవుతుంది. చాలా మంది అమ్మడం లేదు. కొనడానికి కూడా గ్రామాల్లోకి ఎవరూ వస్తలేరు.

– అశోక్‌, కౌటాల

కెరమెరిలోని రేషన్‌ షాప్‌ ఎదుట లబ్ధిదారులు

సరుకులూ ఇవ్వాలి

పేదవారికి ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంతో పాటు గతంలో మాదిరి నిత్యావస ర సరుకులు పంపిణీ చేయాలి. సన్నబి య్యం నాణ్యతతో ఉండేలా పర్యవేక్షించాలి. – మోతె పద్మ, ఆసిఫాబాద్‌

ప్రతిరోజూ తింటున్నాం

రేషన్‌ దుకాణాల్లో తెచ్చుకున్న బి య్యం ప్రతిరోజూ తింటున్నాం. ప్రభుత్వం సన్నబియ్యం అందించడం సంతోషంగా ఉంది. మా లాంటి పేదవారికి చేయూతనిస్తుంది. స్వయంగా కలెక్టర్‌ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి భోజనం చేయడం శుభ పరిణామం.

– సంపూర్ణ, గృహిణి, ఆసిఫాబాద్‌

కార్డులు లేక నష్టపోతున్నారు

కొన్నేళ్లుగా కొత్త రేషన్‌ కార్డులు మంజూరు కాకపోవడంతో అర్హులు నష్టపోతున్నారు. సన్నబియ్యం అందిస్తున్న నేపథ్యంలో అనేక మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. నూతన కార్డులు వెంటనే మంజూరు చేయాలి.

– చంద్రకళ, హీరాపూర్‌

అన్నం బాగానే ఉంది

సన్నబియ్యంతో అన్నం వండుకున్నం.. ఇప్పటికై తే బాగానే ఉంది. ఇంతకుముందు దొడ్డు బియ్యం అన్నం తినేందుకు ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు ఇంట్లో పిల్లలు కూడా తింటున్నరు. ఎప్పటికీ ఇలాంటి సన్నబియ్యమే ఇయ్యాలే. నూకలు కూడా ఉంటున్నయ్‌.

– పుల్గం విజయ, దహెగాం

రుచి లేదు

దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం ఇస్తున్నా అన్నం రుచి ఉండడం లేదు. అన్నం వండినప్పుడు ముద్దగా తయారవుతుంది. వచ్చే నెలలోనైనా నాణ్యమైన బియ్యం అందించాలి. అర్హత లేని వారి కార్డులు తొలగించి, అసలైన లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు అందించాలి. – తుపాకుల వెంకన్న, ఆసిఫాబాద్‌

బియ్యం బాగున్నయ్‌..!1
1/9

బియ్యం బాగున్నయ్‌..!

బియ్యం బాగున్నయ్‌..!2
2/9

బియ్యం బాగున్నయ్‌..!

బియ్యం బాగున్నయ్‌..!3
3/9

బియ్యం బాగున్నయ్‌..!

బియ్యం బాగున్నయ్‌..!4
4/9

బియ్యం బాగున్నయ్‌..!

బియ్యం బాగున్నయ్‌..!5
5/9

బియ్యం బాగున్నయ్‌..!

బియ్యం బాగున్నయ్‌..!6
6/9

బియ్యం బాగున్నయ్‌..!

బియ్యం బాగున్నయ్‌..!7
7/9

బియ్యం బాగున్నయ్‌..!

బియ్యం బాగున్నయ్‌..!8
8/9

బియ్యం బాగున్నయ్‌..!

బియ్యం బాగున్నయ్‌..!9
9/9

బియ్యం బాగున్నయ్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement