తల్లాడ: మండలంలోని పినపాక జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు వారి తల్లి పేరుతో మొక్క నాటి సంరక్షించాలని, తద్వారా పర్యావరణ సమతుల్యత, పర్యావరణ సంరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. ఎంపీడీఓ శ్రీధర్రాజు, ఎంఈఓ దామోదరప్రసాద్, ఏపీఓ కోటయ్య, సర్పంచ్ గుర్రం శ్రీనివాసరావు, ఈసీ అరుంధతి, నజీర్, సునీత, పరశురామ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక వైరా ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి బాజోజు ప్రవీణ్కుమార్ పరిశీలించారు. సందర్శించారు. ఇక వైరా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే రాందాస్నాయక్, వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈఓ రవిబాబు మొక్క నాటారు.


