జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా..
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులతో ప్రతిభ చాటారు. ఈమేరకు ఆయా విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు అభినందించి వివరాలు వెల్లడించారు. – ఖమ్మం సహకారనగర్
● న్యూవిజన్ ప్రభంజనం
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్జీకే.ప్రసాద్ తెలిపారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో పేరాల ప్రణవ్ 497వ ర్యాంక్, మరో కేటగిరీల్లో అజ్మీరా రోషిక్ మణిదీప్ 5వ ర్యాంక్ సాధించారని తెలిపారు. ఇక భూక్యా పీయుష్ వర్థన్ 102, అజ్మీరా జిగీష 204, ఆంగోతు శ్యామ్ 205, భూక్యా యశ్వంత్ 394, పేరాల ప్రణవ్ 497, గూడె కార్తీక్సాయి 537, చంద్రసాయికృష్ణ 556, గుగులోతు షణ్ముఖ 562, తేజావత్ స్రవంతి 605, బానోతు వివేక్రామ్ 618, భూక్యా ప్రతీక్ 678, స్వర్ణ మనస్విక్ 770, గంగావత్ చరణ్తేజ్ నాయక్ 888, రామ కౌశిక్ 953, పగిడిపల్లి చేతన్చంద్ర 977, కంసాని మధుర హాసిని చౌదరి 1,026, భుక్యా శివనాగచైతన్య 1,093, బానోతు కౌశిక్ 1,377, ధర్మసోత్ రాహుల్ నాయక్ 1,427, వడ్లముడి ఆశిష్ 1,433, ఆళ్ల హేమంత్ 1,683, పండేటి యశస్విన్ 1,797, వాంకుడోతు బిందుబాయ్ 1,800, బానోతు దీపిక 1941, బానోతు మోహన్ సాయిలక్ష్మి 1,962వ ర్యాంకు సాధించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సీహెచ్.గోపీచంద్, సీహెచ్.కార్తీక్, ప్రిన్సిపాల్ బ్రహ్మచారి, శ్రీనివాసరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.
● శ్రీచైతన్య.. ఆల్టైం రికార్డు
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంక్లతో ఆల్టైం రికార్డు సృష్టించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. ఆలిండియా స్థాయిలో హెచ్.జశ్వంత్ 9వ ర్యాంక్, ఎస్వీ.వీరబ్రహ్మం 92, బి.లిగ్నేష్ 144, వి.కుషాల్ 165, బి.విక్టోరియా 199, బి.జయంత్ 221, ఐ.అను 258, ఎం.జ్ఞాతిక్ లక్కి 270, డి.అంకిత 272, జి.కార్తీక్ 330, డి.రూపేష్ 370, ఎన్.జస్మిత 375, బి.వరుణ్ సాయి 383, హెచ్.జీవన్ 456, బి.మృదున 478, జి.ఉదయ్ కృష్ణ 502, జి.అమృత హాసిని 527, బి.సిద్ధు 538, బి.సిద్ధార్థ 560, బి.వంశీ 598, జె.లహరి 602, జి.రాహుల్ 664, బి.మహేష్ 673, టి.రోహిత్ 677, బి.పండు చరణ్ 761, ఎల్.మనోజ్కుమార్ 768, ఎం.లోకేష్ 847, బి.సుజిత్ 850, జె.మాయావతి 870, హెచ్ఎస్ చరణ్తేజ 882, వి.ప్రణతి 897, ఈ.శ్రీకర్ 921, బి.మురళి 928, టి.జశ్వంత్కుమార్ 947, బి.లావణ్య 1,007వ ర్యాంక్ సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బి.సాయిగీతిక, డీజీఎం చేతన్మాదూర్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్ఆర్ఎస్డీ.వర్మ, డీన్ జె.కృష్ణ, ఏజీఎంలు సీహెచ్.బ్రహ్మం, జి.ప్రకాశ్, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జేఈఈ అడ్వాన్స్డ్లో సత్తా..


