శ్రావణ మాసం ముగింపు సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా ‘సద్ది మూటలు’ కట్టుకుని పాదయాత్ర చేపట్టారు. గురువారం సాయంత్రం షహాబాద్ నుంచి కలబుర్గిలో వెలసిన శరణ బసప్ప దేవాలయం వరకు సుమారు 40 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. భక్తి గీతాలు ఆలపిస్తూ శరణ బసప్ప స్వామిని దర్శించుకునేందుకు ముందుకు సాగారు. దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సామూహిక భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అన్నదానం చేశారు.
రాయచూరు రూరల్:


