సాక్షి,బళ్లారి: బళ్లారి చలో పాదయాత్ర గురువారం ముగియడంతో ఉదయం 10 గంటల నుంచి నగరంలోని శ్రీకనక దుర్గమ్మ ఆలయం, శ్రీకోట మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్రైస్తవ మత గురువులను కలుసుకుని ఆశీర్వచనం పొందారు. మోతీ సర్కిల్ వద్ద విశ్వగురు బసవేశ్వర ప్రతిమ, కుమార స్వామి ఆలయం వద్ద భక్త కనకదాసు ప్రతిమ, బాబూ జగ్జీవన్ రాం, అంబేడ్కర్ ప్రతిమలకు పూలమాలలు వేశారు. విజయేంద్రతో పాటు బీజేపీ నేతలు చలవాది నారాయణ స్వామి, మాజీ మంత్రి శ్రీరాములు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, గాలి లక్ష్మీ అరుణ, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి తదితరులు నగరంలో కలియతిరిగారు.


