
●సంస్కరణల గురువు బసవన్న
శివాజీనగర: సమానత్వ ఉద్ధారకుడు, జగజ్యోతి బసవణ్ణ విశ్వగురు అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. బుధవారం బెంగళూరులో బసవేశ్వరుని 894వ జయంతి సందర్భంగా విధానసౌధ బసవేశ్వర సర్కిల్లో బసవన్న విగ్రహానికి నివాళులర్పించారు. బసవణ్ణ విశ్వగురువు. ఆయను సమాజంలో సంస్కరణలే కాదు, ప్రపంచంలో మార్పు తీసుకొచ్చారని అన్నారు. అటువంటి మహాత్మున్ని జ్ఞాపకం చేసుకోవటం ప్రతి ఒక కన్నడిగుడి, భారతీయుల కర్తవ్యమన్నారు. తరువాత బాగల్కోట జిల్లా కూడల సంగమలో జరిగిన వేడుకల్లో సీఎం, మంత్రులు పాల్గొన్నారు.
పార్లమెంటు ఆవరణలో
ఢిల్లీలోని పార్లమెంట్ భవనం ఆవరణలో బసవేశ్వర విగ్రహానికి కన్నడ స్వామీజీలు, ఎంపీలు, నాయకులు అధికారులు పుష్పాంజలి ఘటించారు. బసవణ్ణ 12వ శతాబ్దంలోనే సమానత్వ సందేశాన్ని చాటిచెబుతూ, కష్టేఫలి సిద్ధాంతాన్ని బోధిస్తూ సమాజ నిర్మాణం కోసం శ్రమించారని పేర్కొన్నారు. బసవ జయ మృత్యుంజయ స్వామి పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఊరేగింపులు, కళా ప్రదర్శనలతో జయంతి ఉత్సవాలు జరిగాయి.
ప్రధాని ట్వీట్
శ్రమయే స్వర్గమని ప్రపంచానికే సందేశమిచ్చిన శ్రమ యోగి, మహా మానవతావాది బసవేశ్వరుడు అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో కన్నడలో శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సేవలను కొనియాడారు.
రాష్ట్రమంతటా ఘనంగా బసవేశ్వరుని జయంతి వేడుకలు
కూడల సంగమలో సీఎం నివాళులు

●సంస్కరణల గురువు బసవన్న