
షేర్ల పేరుతో నిండా మోసం
మైసూరు: మైసూరు నగరంలో జరిగిన రెండు వేర్వేరు సైబర్ మోసాల్లో పెట్టుబడి పెట్టి రు.1.52 కోట్లను పోగొట్టుకున్నారు. సులభంగా అధిక డబ్బు సంపాదించవచ్చనే దురాశకు పోయి ఉన్న సొమ్మును నష్టపోయారు. వివరాలు.. గాయత్రిపురానికి చెందిన ఇంజినీర్ ఇన్స్టా గ్రాంలో వచ్చిన యాడ్ను చూసి లింక్ నొక్కారు. దీంతో ట్యాక్స్ వ్యాల్యూ అనే గ్రూప్లో చేర్చారు. తమ యాప్ ద్వారా షేర్లలో నగదు పెట్టుబడి పెట్టాలని, విపరీతంగా లాభాలు వస్తాయని మోసగాళ్లు మెసేజ్లు పంపేవారు. బాధితుడు నమ్మి వారు చెప్పినట్లుగా ఆన్లైన్లో నగదు బదిలీ చేశాడు. మొదట భారీగా లాభాలు వచ్చినట్లు చూపించడంతో ఆశ పెరిగి మొత్తం రూ 1.26 కోట్లను పెట్టుబడి పెట్టాడు. తరువాత అవతల నుంచి ఎలాంటి సమాధానం రాక పోవడంతో మోసపోయినట్లు గుర్తించాడు.
నిరుద్యోగికి రూ.15 లక్షలు
రెండవ కేసులో.. టెలిగ్రామ్లో వచ్చి యాడ్ను చూసి కనకదాస నగరకు చెందిన యువకుడు పార్ట్టైం పని కోసమని సంప్రదించాడు. మొదట మోసగాళ్లు కొన్ని టాస్కులు ఇచ్చి కొంచెం నగదు వేశారు. తమ ద్వారా షేర్లలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో యువకుడు రూ. 15 లక్షలను వారి ఖాతాలకు బదిలీ చేశాడు. ఆ తరువాత వంచకుల నుంచి స్పందన కరువైంది. మోసపోయానని గుర్తించి సైబర్ ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మైసూరువాసికి రూ.1.26 కోట్ల టోపీ