
యశవంతపుర: దావణగెరె జిల్లాలో ఎమ్మెల్యేల గెలుపు, ఓటములపై జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. హొన్నాళి తాలూకా చిక్కగోణిగెరె గ్రామంలో కాంగ్రెస్ గెలుస్తుదంటూ దండోరా వేయించి బెట్టింగ్కు ఆహ్వానించటం చర్చలకు దారి తీస్తోంది. హొన్నాళిలో కాంగ్రెస్ అభ్యర్థి శాంతనగౌడ గెలుస్తారు. బెట్టింగ్ కట్టేవారు ఎవరైన ఉంటే చిక్కగోణిగెరె దేవస్థానం వద్దకు రావాలని కాంగ్రెస్ నాయకుడు నాగణ్ణ దండోరా ద్వారా సవాల్ చేసి బెట్టింగ్కు ఆహ్వానించారు.
బీజేపీ అభ్యర్థి ఎంపీ రేణుకాచార్యను ఓడించాం. కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే శాంతనగౌడ గెలుస్తారు. ఎవరైనా బెట్టింగ్కు సిద్ధమైతే దేవస్థానం వద్దకు రండి అంటూ దండోరా వేశారు. కాంగ్రెస్ గెలుస్తుంది..తనవద్దనున్న రెండెకరాల భూమిని కాంగ్రెస్ అభ్యర్థి తరపున బెట్టింగ్ కడుతున్నట్లు నాగణ్ణ దండోరా వేయించారు.
చెన్నగిరిలో కాంగ్రెస్ గెలుపు.. రెండెకరాల భూమి బెట్టింగ్
చెన్నగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శివగంగా బసవరాజ్ గెలుస్తారు. తన రెండు ఎకరాల భూమిని బెట్టింగ్కు సిద్ధమంటూ అభిమాని ఆహ్వనించిన వీడియో వైరల్గా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి ఓడితే రెండు ఎకరాల భూమి మీదేనంటూ వీడియోలో చెప్పాడు. చెన్నగిరి తాలూకా తావరెకెరెకి చెందిన మరో కాంగ్రెస్ అభిమాని కాంగ్రెస్ గెలుస్తుందంటూ సవాల్ చేసిన వీడియో జిల్లా వ్యాప్తంగా వైరల్ అయింది. (చదవండి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023)
200 బూత్ల్లో నాదే లీడ్
చెన్నగిరి నియోజకవర్గంలో రెండు వందల బూతుల్లో తనదే లీడ్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి శాంతనగౌడ విశ్వాసం వ్యక్తం చేశారు. క్షేత్రంలో రేణుకాచార్య అవినీతిపాలనకు చరమగీతం పాడనున్నట్లు కాంగ్రెస్ అభ్యర్థి అవిశ్వాసం వ్యక్తం చేయటంతో అభిమానులు బెట్టింగ్కు కారణమని తెలుస్తోంది. మరో పక్క మైసూరు జిల్లా హెగ్గడదేవనకోటెలో కాంగ్రెస్–జేడీఎస్ అభిమానులు ఐదు లక్షలు బెట్టింగ్ కట్టుకుని అగ్రిమెంట్ పేపర్పై రాసుకుని రూ.10 లక్షలను మధ్యవర్తి చేతికి ఇచ్చిన అగ్రిమెంట్ పేపర్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది.