పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా వేధిస్తూ మళ్లీ సర్వే చేయాలని చెప్పడం సరైనది కాదని... సర్వే బిల్లులు వచ్చేవరకు ప్రస్తుత లెప్రసీ సర్వే చేసేది లేదని ఆశా కార్యకర్తలు తేల్చిచెప్పారు. గురువారం డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. స్పందించిన డీఎంహెచ్వో వెంకటరమణ బిల్లులు వచ్చాక ఖాతాలో జమచేస్తామని తెలిపారు. నిర్దిష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆశ కార్యకర్తలు సర్వే చేసేదిలేదని తేల్చిచెప్పారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుంద రెడ్డి, ఆశ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రంగమైన శారద, జిల్లా ప్రధాన కార్యదర్శి మారేళ్ల శ్రీలత, రాజమణి, లత, సత్యలక్ష్మి, లక్ష్మి, శంకరమ్మ, రజిత, పద్మ, ప్రియాంక, స్వప్న, సుజాత, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. – కరీంనగర్టౌన్
కాలువ గేట్లు ఎత్తివేస్తాం
● రైతులను ఆదుకుంటాం
● బడ్జెట్లో కరీంనగర్కు తీవ్ర అన్యాయం
● మానేర్ రివర్ ఫ్రంట్కు మొండిచేయి
● కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్: కరీంనగర్ రూరల్ మండలానికి డీ–89 కాలువ ద్వారా రావాల్సిన వాటా సాగునీరు అందకపోతే రెగ్యులేటర్ గేట్లను ఎత్తివేస్తామని, అవసరమైతే వాటిని పగులకొడతామని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. తలాపున ఉన్న మానేరులో నీళ్లు అడుగంటుతున్నాయని, వచ్చే రెండు నెలల్లో కరీంనగర్లో నీటి ఎద్దడి నెలకొనే ప్రమాదముందని, అయినా కాంగ్రెస్ నాయకులకు సోయిలేదని విమర్శించారు. జిల్లా నుంచి గొప్ప మంత్రులు ఉన్నా ఈ బడ్జెట్లో జిల్లాకు ఒక్కపైసా కేటాయించలేదని మండిపడ్డారు. కాకతీయ కాలువ 116 క్రాస్ జంక్షన్ వద్ద సాగునీటి సరఫరాలో సమన్యాయం పాటించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. బడ్జెట్లో బీసీలకు కనీసం తగిన నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. కరీంనగర్ నగర అభివద్ధికి బీఆర్ఎస్ హయాంలో రూ.350 కోట్లు తీసుకువచ్చామని, 2023 డిసెంబర్ వరకు వేగంగా పనులు సాగాయని గంగుల గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని పనులు నిలిచిపోయాయని అన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్కు నిధుల కేటాయింపుపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. పార్టీ నగర అధ్యక్షుడు హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, కంసాల శ్రీనివాస్, రాజేందర్రావు, గందె మహేశ్, బండారి వేణు, సుంకిశీల సంపత్రావు, నారదాసు వసంత్రావు, పబ్బతి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
నేడు రైల్వే జీఎం రాక
కరీంనగర్రూరల్: కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్లను శుక్రవారం దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజరు అరుణ్కుమార్ జైన్ సందర్శిస్తారని కరీంనగర్ స్టేషన్ మేనేజర్ ఎం.రవీందర్ తెలిపారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. జీఎం అరుణ్కుమార్ ప్రత్యేక రైలులో అధికారులతో కలిసి ఉదయం 8.30 గంటలకు కరీంనగర్ రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. అనంతరం రామగుండం వెళ్తారని మేనేజరు వివరించారు.
గనుల ద్వారా ఆదాయం
ఉమ్మడి జిల్లా సహజ వనరులకు నెలవైన ప్రాంతం. బొగ్గు, గ్రానైట్, ఇసుక, ఇటుక బట్టీలు తదితర మైనింగ్ కార్యకలాపాలతో రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుతుంది. ఉమ్మడి జిల్లా నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు రూ.190.62 కోట్లకు గాను రూ.156.21కోట్ల ఆదాయం ప్రభుత్వానికి తెచ్చిపెట్టింది.
జిల్లా టార్గెట్ వసూలైంది
(రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో)
పెద్దపల్లి 2,465.99 2,264.30
సిరిసిల్ల 1,465.07 1,342.18
కరీంనగర్ 12,872.16 10,658.72
జగిత్యాల 2,259.05 1,356.26
జీడీడీపీలో అంతంతే..
ఒక ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఉత్పత్తి చేసిన వస్తు, సేవల మొత్తం విలువే జీడీడీపీ. జిల్లా ఆర్థికాభివృద్ధికి ముఖ్య కొలమానంగా పరిగణించే జీడీడీపీలో కరీంనగర్ మెరుగ్గా ఉంది. సిరిసిల్ల రాష్ట్రంలోనే 29వస్థానంలో నిలిచింది.
జిల్లా జీడీడీపీ(రూ.కోట్లలో) ర్యాంకు
కరీంనగర్ 30.216 12
పెద్దపల్లి 27,649 13
జగిత్యాల 24,011 18
సిరిసిల్ల 13,981 29
తలసరి ఆదాయం భేష్..
వ్యక్తుల ఆదాయంగా పేర్కొనే తలసరి ఆదాయం విషయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు ముందంజలో ఉన్నాయి. పెద్దపల్లి టాప్లో ఉండగా, జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది.
జిల్లా తలసరి ఆదాయం ర్యాంకు
పెద్దపల్లి 2,84,661 8
కరీంనగర్ 2,50,243 13
సిరిసిల్ల 2,13,725 28
జగిత్యాల 2,05,273 31
జిల్లాల వారీగా గ్యాస్ కనెక్షన్లు
జగిత్యాల 3,38,700
పెద్దపల్లి 2,34,600
కరీంనగర్ 5,90,700
సిరిసిల్ల 1,69,200
బిల్లులు ఇవ్వకుంటే సర్వే చేయం
బిల్లులు ఇవ్వకుంటే సర్వే చేయం
బిల్లులు ఇవ్వకుంటే సర్వే చేయం
బిల్లులు ఇవ్వకుంటే సర్వే చేయం