ఆగని అక్రమ నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

ఆగని అక్రమ నిర్మాణాలు

Nov 18 2023 1:38 AM | Updated on Nov 18 2023 1:38 AM

కమాన్‌పూర్‌లోని అసైన్డ్‌ భూమిలో నిర్మిస్తున్న కట్టడాలు - Sakshi

కమాన్‌పూర్‌లోని అసైన్డ్‌ భూమిలో నిర్మిస్తున్న కట్టడాలు

కమాన్‌పూర్‌లో జోరుగా కట్టడాలు

ఎన్నికల వేళ.. అక్రమాల దందా

కబ్జా కోరల్లో విలువైన ప్రభుత్వ భూమి

పట్టించుకోని అధికారులు

కొత్తపల్లి: కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 120, 123లోని ‘తూంకుంట’లో అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు. అధికారుల సమన్వయం లోపం అక్రమార్కులకు వరంగా మారింది. ఒక్క చిన్న పశువుల పాకతో ప్రారంభమైన ఆక్రమణలు ప్రస్తుతం భవంతుల నిర్మాణాల వరకు చేరుకున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ తహసీల్దార్‌ ‘మామూలు’గా తీసుకోవడంతో అక్రమార్కులకు అడ్డూ అదుపులేకుండా పోయింది. రాజకీయ ఒత్తిళ్లతో తదనంతరం వచ్చిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో జోరుగా అక్రమ నిర్మాణాలు సాగాయి. ఇక ఇప్పుడైతే అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా సందిట్లో సడేమియాలాగా మళ్లీ నిర్మాణాలు జోరందుకున్నా యి. ఇదే తూంకుంటలోని అక్రమ నిర్మాణాలను గతంలో ఓ తహసీల్దార్‌ కూల్చివేయడంతో పాటు అందులో వేసిన బోరుబావిని, ఆ స్థలంలో మట్టి నింపుతున్న రెండు ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. అయితే ఇదే స్థలంలో మళ్లీ నిర్మాణాలు సాగుతుండటం అనుమానాలకు తావిస్తోంది. చట్టప్రకారం ఒక తహసీల్దార్‌ చ ర్యలకు ఉపక్రమిస్తే.. తదనంతరం తహసీల్దార్లు అదే చట్టాన్ని అనుసరించాలి. కానీ ఎలాంటి చర్యలు చేపట్టడకంపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇది లా ఉంటే గ్రామ పంచాయతీ అధికారులు మాత్రం కళ్లుండి చూడలేని దుస్థితిలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పనిచేసే పంచాయతీ వ్యవస్థ అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారనే నిందను మోస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన అసైన్డ్‌ భూమిని కాపాడటంలో అధికారులు విఫలమయ్యారని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అక్రమ నిర్మాణాలపై అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ వాటిని అధికారులు బుట్టదాఖలు చేస్తుండటంపై గ్రామస్తుల్లో సందేహాలు నెలకొన్నాయి. అధికారులు అడపాదడపా నోటీసులు జారీ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. కొంతమంది ఫిర్యాదులు చేసి అసహనానికి లోనయ్యారే తప్ప అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కుల హవా ఏ విధంగా నడుస్తుందో చెప్పవచ్చు. ఈ తూంకుంటలో అక్రమ నిర్మాణాలు వెలిసాయని నీటి పారుదల శాఖ అధికారులు సైతం గతంలోనే తేల్చినప్పటికీ రెవెన్యూ, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికారుల సమన్వయం లోపం..

అక్రమార్కులకు వరం

కరీంనగర్‌–వేములవాడ ప్రధాన రహదారి పక్కనున్న అసైన్డ్‌ భూమిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా రెవెన్యూ, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ భూమిపై రెవెన్యూ అధికారులు తేల్చాలని పంచాయతీ అధికారులు.. లేదు లేదు అనుమతిలేని అక్రమ నిర్మాణాలు ఆపాల్సిన బాధ్యత పంచాయతీ అధికారులదేనంటూ రెవెన్యూ అధికారులు ఒకరిపై మరొకరు గతంలో దాటవేసే ధోరణిని అవలంబించడంతోనే అక్రమ నిర్మాణాల జోరు కొనసాగింది. అదికాస్త ప్రస్తుతం కొనసాగుతోంది. కరీంనగర్‌కు కూతవేటు దూరంలో ఉండటం వల్ల భూములకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. దీనిని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు విలువైన భూమిని కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.

నోటీసులిచ్చాం

కమాన్‌పూర్‌ పంచాయతీ పరిధిలోని తూంకుంటలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలకు ఎలాంటి పంచాయతీ అనుమతుల్లేవు. సెలవు దినాలను చూసుకొని నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై తగిన డాక్యుమెంట్లు సమర్పించాలని కోరుతూ నోటీసులిచ్చా. ఈ నిర్మాణాలను ఎంపీవో దృష్టికి తీసుకెళ్లా. తూకుంటలోని ఏ ఒక్క కట్టడానికి కూడా పంచాయతీ అనుమతి లేదు. – నరేశ్‌,

పంచాయతీ కార్యదర్శి, కమాన్‌పూర్‌

అనధికార నిర్మాణంపై పంచాయతీ కార్యదర్శి జారీ చేసిన నోటీసు 1
1/2

అనధికార నిర్మాణంపై పంచాయతీ కార్యదర్శి జారీ చేసిన నోటీసు

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement