మాటల మాంత్రికుడు గోపాల్‌ | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 5 2023 12:38 AM

వ్యాఖ్యానం చేస్తున్న మాడిశెట్టి గోపాల్‌ - Sakshi

ఉమ్మడి జిల్లాలో వ్యాఖ్యానమంటే మాడిశెట్టి గోపాల్‌ పేరే వినిపిస్తుంది. కరీంనగర్‌కు చెందిన గోపాల్‌ది ఎల్‌ఐసీలో హయ్యర్‌గ్రేడ్‌ అసిస్టెంట్‌ హోదా. అటు విధి నిర్వహణ.. ఇటు ప్రవృత్తిని కొనసాగిస్తూ గుర్తింపు పొందారు. గణతంత్ర, స్వాతంత్య్ర, రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా పోలీస్‌ పరేడ్‌ మైదానంలో వినిపించే మాటలు ఇతనివే. అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్‌.రాజశేఖర రెడ్డి జిల్లా పర్యటనల సమయంలోనూ తన వ్యాఖ్యానం ద్వారా అభినందనలు పొందారు. మలేసియా, సింగపూర్‌లోనూ వ్యాఖ్యానం చేశారు. ఉత్తమ వ్యాఖ్యాతగా అనేక అవార్డులు పొందారు. దీనితోపాటు కవి, రచయిత, నటుడిగానూ రాణిస్తున్నారు.

Advertisement
Advertisement