బాన్సువాడ: హనుమాన్ మాలధారణ స్వాములకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హనుమాన్ దీక్ష స్వాముల ప్రతినిధి అంబిల్పూర్ రాజు మాట్లాడుతూ.. ఈ నెల 21న బాన్సువాడలో హనుమాన్ దీక్ష స్వాముల 17వ సామూహిక మహా మండల పూజ మహోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఆలయ ధర్మకర్త పోచారం శంభూరెడ్డిలు హాజరవుతున్నారని అన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.


