పిట్లం(జుక్కల్): ఆహ్లాదకర వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని ఎంఈవో దేవి సింగ్ సూచించారు. ఆయన శుక్రవారం మండల కేంద్రంలో ఇన్విజిలేటర్లు, మూడు సెంటర్ల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా దేవిసింగ్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేశామని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా పకడ్బందీ నిర్వహించాలన్నారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రమణారావు, శ్రీనివాస్ సూరి, శ్రీలత, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.


