ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ప్రజావాణికి 91 వినతులు
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవా రం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 91 ఫిర్యాదు లు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్ కా ర్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, బిల్లుల మంజూరులకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించాలన్నారు. సమస్యల ను పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూ పడం గానీ చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు ఫిర్యా దులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. అదనపు క లెక్టర్ విక్టర్, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మ ద్, వివిధ శాఖల జిల్లా అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.


