రైతులకు మరింత సేవ చేసుకునే అవకాశం | - | Sakshi
Sakshi News home page

రైతులకు మరింత సేవ చేసుకునే అవకాశం

Aug 16 2025 7:18 AM | Updated on Aug 16 2025 7:18 AM

రైతులకు మరింత సేవ చేసుకునే అవకాశం

రైతులకు మరింత సేవ చేసుకునే అవకాశం

రైతులకు మరింత సేవ చేసుకునే అవకాశం

ఎన్‌డీసీసీబీ చైర్మన్‌ కుంట రమేశ్‌ రెడ్డి

సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల

చిత్రపటాలకు పాలాభిషేకం

సుభాష్‌నగర్‌: రాష్ట్రంలోని సహకార సంఘాలు, డీసీసీబీల పాలకవర్గాల పదవీకాలం గడువు మరోసారి ఆరు నెలలు పొడిగించి రైతులకు మరింత సేవ చే సుకునే భాగ్యాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మ ల నాగేశ్వర్‌రావు, మంత్రివర్గం కల్పించిందని ఎన్‌డీసీసీబీ చైర్మన్‌ కుంట రమేశ్‌ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్‌డీసీసీబీ ప్రధాన కార్యాలయ ఆవరణలో శుక్రవారం పాలకవర్గాల గడువు ఆరు నెలలు పొడిగించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రమేశ్‌ రెడ్డి మాట్లాడుతూ ఎన్‌డీసీసీబీని రాష్ట్రంలోనే ఉత్తమమైన బ్యాంకుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రధానంగా ఎన్‌పీఏ తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించామని, అందరి స హకారంతో బ్యాంకుకు పూర్వవైభవం తీసుకొస్తా మని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకార సంఘాల చైర్మన్లు, బ్యాంకు డైరెక్టర్ల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వైస్‌ చైర్మన్‌ నల్ల చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement