
ప్రణాళికాబద్ధంగా కొనుగోళ్లు చేపట్టాలి
కామారెడ్డి క్రైం/ఎల్లారెడ్డి : ప్రణాళికాబద్ధంగా యా సంగి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కా న్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సన్న బియ్యం సరఫరా, ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా ధాన్యాన్ని వేగంగా కొనుగో లు చేయాలన్నారు. ధాన్యం సేకరణపై కలెక్టర్లు ప్ర త్యేక దృష్టి సారించి ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నా రు. తాలు, తరుగు పేరు మీద రైస్ మిల్లర్లు ఎలాంటి కోతలు విధించకుండా చూడాలన్నారు. సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. గ్రామాలలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని సూచించారు.
జిల్లాలో 446 కొనుగోలు కేంద్రాలు..
జిల్లాలో 446 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఎ ల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయం నుంచి వీసీలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల గురించి మంత్రికి వివరించారు. 63 కేంద్రాల ద్వారా సన్న ధాన్యం సేకరిస్తున్నామన్నారు. జిల్లాకు సంబంధించి 4.49 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం, 1.13 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగో లు కేంద్రాలకు రావచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 4,314 మెట్రిక్ టన్నుల దొడ్డు బి య్యం, 53,340 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోలు చేశామన్నారు. ఆయా కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని, సౌకర్యాలు కల్పించామని వివరించారు. వీడి యో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, ఆర్డీవో ప్రభాకర్, డీఆర్డీవో సురేందర్, పౌర సరఫరాల సంస్థ డీఎం రాజేందర్, డీఎస్వో మల్లికార్జున్ బాబు, డీసీవో రామ్మోహన్, మార్కె టింగ్ శాఖ అధికారి రమ్య పాల్గొన్నారు.
ధాన్యం సేకరణను కలెక్టర్లు
పర్యవేక్షించాలి
పౌర సరఫరాల శాఖ మంత్రి
ఉత్తమ్కుమార్రెడ్డి