
పెద్దమ్మా.. చల్లంగ చూడమ్మా..
మండల కేంద్రంలో పెద్దమ్మ ఆలయ ఉత్సవాల్లో భాగంగా శనివారం బోనాల పండుగ జరుపుకున్నారు. రాత్రి బోనాలతో శోభాయాత్ర నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి పూజలు చేశారు. ఆదివారం తిరుగుబోనాలతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగారపు ఎల్లయ్య తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పున్న లక్ష్మణ్, కామిండ్ల కృష్ణ, పురుషోత్తం, రాజేందర్, సంతోష్కుమార్, రాములు తదితరులు పాల్గొన్నారు. – దోమకొండ