
ప్రతిభను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది
డీఈవో రాజు
కామారెడ్డి రూరల్: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరికీ ఉందని డీఈవో రాజు అన్నారు. శనివారం చిన్నమల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల వార్షికోత్సవ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈవో రాజు హాజరై ప్రసంగించారు. విద్యార్థులు చదువుతోపాటు ఆట పాటల్లో ముందుండాలన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇది మంచి వేదికగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎంఈవో ఎల్లయ్య, హెచ్ఎంలు సాయిరెడ్డి, హన్మాండ్లు, సెక్టోరియల్ అధికారి నాగవేందర్, ఎఫ్ఏవో రమేష్, ఏసీజీ బలరాం, జీసీడీవో సుకన్య తదితరులు పాల్గొన్నారు.