రైల్వే పట్టాలపై మొరాయించిన డీసీఎం
ఖలీల్వాడి: నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి రైల్వే పట్టాలపై డీసీఎం మొరాయించడంతో సుమా రు అరగంట పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం రాత్రి 9:10గంటలకు బైపా స్ నుంచి ఆటోనగర్ వైపు వస్తున్న డీసీఎం రైల్వే ప ట్టాలపై మొరాయించింది. ఈసమయంలో బాసర వైపు నుంచి వస్తున్న రైలుకు, రైల్వే గేటు సిబ్బందికి సమాచారం తెలపడంతో రైలును రైల్వేగేటు సమీపంలో నిలిపివేశారు. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. స్థానికులు సుమారు అరగంటపాటు కష్టపడి డీసీఎంను పట్టాలు దాటించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం తొలగింది.