రావమ్మా! మహలక్ష్మి రావమ్మా.. అంటూ శ్రావణ శుక్రవారం పూజలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం వరలక్ష్మీ వ్రత పూజల సందర్భంగా గురువారం జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో మార్కెట్లు కిటకిటలాడాయి. పూజా సామగ్రి, బంగారు రూపుల కొనుగోలుతో సందడి నెలకొంది. కాకినాడ భానుగుడి, నాగమల్లితోట జంక్షన్, పిఠాపురం, పెద్దాపురం, తుని, ఏలేశ్వరం తదితర చోట్ల మార్కెట్లు రద్దీగా మారాయి. పూజా సామగ్రి ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్యులు ఇబ్బంది పడ్డారు.
–బోట్క్లబ్ (కాకినాడ), ఏలేశ్వరం


